ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే ఫీడ్ ధరల పెంపుతో నష్టాల్లో కూరుకుపోయిన ఆక్వా రైతులపై ఇప్పుడు విద్యుత్ సబ్సిడీ కోతల కత్తి వేలాడదీస్తున్నారని ఆరోపించారు. నెలాఖరులోగా సమస్యలు పరిష్కరించకపోతే జూలై 1 లేదా 2న ఆక్వా రైతులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి దిగుతామని స్పష్టం చేశారు.
ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించాలి

ఆక్వా రైతులను దోచుకునే సిండికేట్కు ప్రభుత్వం అండగా ఉందా?
ఆక్వా సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ రంగాల్లో ఒకే వర్గం ఆధిపత్యం చెలాయిస్తోందని జగన్ ఆరోపించారు. ఈ సిండికేట్కు అధికార పెద్దల అండదండలు ఉన్నాయనే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.
అప్సడా (APSADA) అనుమతి లేకుండానే ఫీడ్ ధరలను ఇష్టారాజ్యంగా పెంచడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయని ఆయన ప్రశ్నించారు.
- వనామీ ఫీడ్పై కిలోకు రూ.10 పెంపు
- టైగర్ ఫీడ్పై కిలోకు రూ.12 అదనపు భారం
- రైతులపై కోట్ల రూపాయల అదనపు భారంగా మారిన ధరల పెంపు
“ఇది కంపెనీల ట్యాక్సా? లేక సీబీఎన్ ట్యాక్సా? లోకేశ్ ట్యాక్సా?” అంటూ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించాలి
విద్యుత్ సబ్సిడీ కోతలతో రైతులను కుంగదీసే కుట్ర?
వారం క్రితం తీసుకొచ్చిన జీవో ఆర్టీ నంబర్ 169లోని క్లాజ్-4 పేరుతో పవర్ ఫ్యాక్టర్ నిర్వహణ నిబంధనలను తెరపైకి తీసుకువచ్చి ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని జగన్ ఆరోపించారు.
ఇప్పటికే పెట్టుబడులు పెరిగి, ఎగుమతుల్లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న రైతులపై మరో భారం మోపడం అన్యాయమని అన్నారు.
ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించాలి
చంద్రబాబు హయాంలోనూ సమస్యలు.. ఇప్పుడు మరింత భారమా?
2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ధర రూ.3.85గా ఉండేదని జగన్ గుర్తు చేశారు. ఇప్పుడు విద్యుత్ సబ్సిడీ కోతల సంకేతాలు రావడం, ఫీడ్ ధరలు అదుపు తప్పడం వల్ల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.
మా హయాంలో ఆక్వా రంగానికి రక్షణ కవచంలా నిలిచాం
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆక్వా రంగాన్ని దేశంలోనే అగ్రస్థానానికి తీసుకెళ్లేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నామని జగన్ తెలిపారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు:
- యూనిట్ విద్యుత్ను రూ.1.50కే అందజేత
- 57 నెలల్లో విద్యుత్ సబ్సిడీగా రూ.3,306 కోట్లు విడుదల
- తీర ప్రాంతాల్లో 35 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఏర్పాటు
- ఆర్బీకేలలో 782 మంది ఫిషరీస్ అసిస్టెంట్ల నియామకం
- ఏపీ ఫిష్ ఫీడ్ (క్వాలిటీ కంట్రోల్) యాక్ట్-2020 అమలు
- ఆక్వా కంపెనీలు రైతులకు జవాబుదారీగా ఉండేలా కఠిన చర్యలు
ఆ చర్యల ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ రొయ్యల ఉత్పత్తి, ఎగుమతుల్లో దేశంలో నెంబర్-వన్గా నిలిచిందని పేర్కొన్నారు.
ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించాలి
రైతుల కోసం పోరాటానికి సిద్ధం.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి
ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే చూస్తూ ఊరుకోబోమని జగన్ హెచ్చరించారు. నెలాఖరులోగా ఫీడ్ ధరలను తగ్గించి, విద్యుత్ సబ్సిడీపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
లేకపోతే జూలై 1 లేదా 2 తేదీల్లో ఆక్వా రైతులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు.
ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించాలి
ఆక్వా రైతుల ఆవేదనకు ప్రభుత్వం స్పందిస్తుందా.. లేక జగన్ హెచ్చరించినట్లే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం తప్పదా?
ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం లక్షలాది కుటుంబాల జీవనాధారం. అలాంటి రంగాన్ని సిండికేట్లకు అప్పగించి రైతులపై అదనపు భారాలు మోపడం సరికాదని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఫీడ్ ధరల పెంపు, విద్యుత్ సబ్సిడీ కోతలు, ప్రభుత్వ వైఖరిపై రైతుల్లో ఆగ్రహం పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా? లేక ఆక్వా రైతుల ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వేడిని మరింత పెంచుతుందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించాలి






