“ఇంధనం పొదుపు చేయండి.. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడండి” అంటూ మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అదే మాటలను రాష్ట్ర కూటమి నాయకులు కూడా గొప్పగా చెబుతున్నారు. కానీ ప్రజలు ఇప్పుడు ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు…
మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో పెట్రోల్ ₹97 ఉంటే.. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎందుకు ₹113..?
దేశంలోనే అత్యధిక పెట్రోల్ ధరలు ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవడం ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది.
ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ ధరలు

దేశంలో టాప్లో ఆంధ్రప్రదేశ్..!
తాజా పెట్రోల్ ధరల జాబితా చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఎంత భారీ భారం పడుతోందో స్పష్టంగా కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ ధరలు
| రాష్ట్రం | పెట్రోల్ ధర |
|---|---|
| ఆంధ్రప్రదేశ్ | ₹113.03 |
| తెలంగాణ | ₹110.89 |
| కేరళ | ₹110.58 |
| కర్ణాటక | ₹106.21 |
| తమిళనాడు | ₹103.67 |
| గుజరాత్ | ₹97.95 |
ఒకే దేశం… ఒకే కేంద్ర ప్రభుత్వం…
కానీ గుజరాత్లో తక్కువ ధరలు, ఆంధ్రలో మాత్రం రికార్డు స్థాయి ధరలు ఎందుకు అనే ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో మండిపోతోంది.
ఏపీ ప్రజల జేబులపై పన్నుల బాంబు..?
ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధరలు పెరగడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న భారీ వ్యాట్, అదనపు పన్నులేనని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి.
ప్రజలు వాడే ప్రతి లీటర్ పెట్రోల్పై ప్రభుత్వం భారీగా వసూలు చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు, బస్సు ఛార్జీలు, నిత్యావసర ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇప్పుడు పెట్రోల్ ధరలు మరో షాక్గా మారాయి.
ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ ధరలు

జిల్లాల వారీగా షాకింగ్ రేట్లు
| జిల్లా | ధర |
|---|---|
| చిత్తూరు | ₹113.58 |
| నెల్లూరు | ₹113.39 |
| కాకినాడ | ₹113.34 |
| కర్నూలు | ₹113.20 |
| మచిలీపట్నం | ₹113.19 |
| ఏలూరు | ₹113.16 |
| గుంటూరు | ₹112.92 |
| అనంతపురం | ₹112.86 |
| శ్రీకాకుళం | ₹112.76 |
| విజయవాడ | ₹112.50 |
ప్రతి జిల్లాలోనూ ₹112-113 మధ్య పెట్రోల్ ధరలు ఉండటం సామాన్యులకు భారంగా మారింది.
“ఇంధన పొదుపు” మాటలేనా..? ప్రజలపై భారమా..?
రాష్ట్ర కూటమి నాయకులు “మోడీ పిలుపు మేరకు ఇంధన పొదుపు చేశాం” అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ప్రజలు మాత్రం మరో ప్రశ్న వేస్తున్నారు:
“పొదుపు చేసింది ప్రభుత్వం కాదు… పెట్రోల్ ధరలు చూసి వాహనం బయటకు తీయలేక ప్రజలే పొదుపు చేస్తున్నారు!”
రోజూ ఉద్యోగాలకు వెళ్లే మధ్యతరగతి, ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, చిన్న వ్యాపారులు ఈ ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గుజరాత్కు ఒక రూల్.. ఆంధ్రకు మరో రూల్..?
మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో ₹97కు పెట్రోల్ అమ్ముతుంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం లీటర్కు ₹16 ఎక్కువ చెల్లించాల్సి రావడం రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
“డబుల్ ఇంజిన్ ప్రభుత్వం” అంటూ ప్రచారం చేసుకున్న నాయకులు ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రజల్ని పీల్చే పెట్రోల్ పాలసీనా..?
పెట్రోల్ ధరలు కేవలం సంఖ్యలు కాదు… ప్రతి కుటుంబ బడ్జెట్పై పడే భారం.
ఒక రాష్ట్రంలో ₹97కి దొరికే పెట్రోల్.. మరో రాష్ట్రంలో ₹113కి ఎందుకు అమ్ముతున్నారు..?
ఈ అదనపు భారం ఎవరి కోసం..? ప్రజల అభివృద్ధికా.. లేక ప్రభుత్వ ఆదాయాల కోసమా..?
ఇప్పుడు ఇదే ప్రశ్న ఆంధ్రప్రదేశ్ అంతటా వినిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ ధరలు






