FCRA గ్రీన్ సిగ్నల్తో అనంతలో ఆనందం… కానీ రాజకీయ హీట్ పెరుగుతోంద
అనంతపురం జిల్లాకు కీలకమైన RDT సంస్థకు ఎఫ్సీఆర్ఏ (FCRA) రెన్యూవల్ మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో జిల్లాలో పండగ వాతావరణం నెలకొంది. అయితే ఈ విజయంపై ఇప్పుడు క్రెడిట్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
పాదయాత్రల నుంచి ఢిల్లీ వరకు… వైఎస్సార్సీపీ పోరాటం ఫలించింది
RDT సంస్థకు విదేశీ నిధుల అనుమతులు నిలిచిపోయిన సమయంలో వేలాది మంది అనాథలు, రైతులు, విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది.
ఈ సమయంలో వైఎస్సార్సీపీ నేతలు సమస్యను వదిలిపెట్టకుండా తీవ్ర స్థాయిలో పోరాటం చేపట్టారు. మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆధ్వర్యంలో జిల్లాలో 16 రోజుల పాటు పాదయాత్ర నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు.
అదే సమయంలో నిరాహార దీక్షలు, నిరసనలు చేపట్టి సమస్యను జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఢిల్లీ వేదికగా పార్లమెంట్ ఆవరణలో వైఎస్సార్సీపీ ఎంపీలతో కలిసి నిరసనలు తెలుపుతూ కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారు.
అంతేకాకుండా, నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి అనంత ప్రజల కష్టాలను వివరించడం ద్వారా సమస్యను పరిష్కార దిశగా మళ్లించారు.
పోరాటం సమయంలో మౌనం… ఇప్పుడు క్రెడిట్ కోసం పోటీ?
🚨 #CreditChorBabu
RDT సంస్థకు సమస్యలు ఎదురైనప్పుడు…
Nara Chandrababu Naidu, Nara Lokesh ఏమి చేశారు?
ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నప్పటికీ, ఒక్కసారైనా FCRA రెన్యూవల్ కోసం పోరాడారా? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో వినిపిస్తున్నాయి.
ట్రస్ట్కు ఇబ్బందులు ఎదురైన సమయంలో జిల్లాలో 16 రోజుల పాటు పాదయాత్ర చేసి, అలుపెరగని పోరాటం చేసింది వైఎస్సార్సీపీ నేతలేనని పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి.
ఇది ముమ్మాటికీ ప్రజల పోరాటం, వైఎస్సార్సీపీ నేతల కృషి ఫలితమేనని స్పష్టం చేస్తున్నారు.
అయితే ఇప్పుడు రెన్యూవల్ వచ్చిన వెంటనే క్రెడిట్ కోసం ముందుకొస్తున్నారనే విమర్శలు చంద్రబాబుపై వ్యక్తమవుతున్నాయి.




ఫలించిన పోరాటం… కానీ క్రెడిట్ యుద్ధం కొనసాగుతోంది
చిరకాలంగా ఎదురుచూస్తున్న అనంతపురం ప్రజల కోరిక నెరవేరింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన FCRA గ్రీన్ సిగ్నల్తో RDT కార్యకలాపాలు మళ్లీ ఊపందుకునే అవకాశం ఏర్పడింది.
అయితే ఈ విజయంపై క్రెడిట్ ఎవరిది అన్న రాజకీయ పోరు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.





