---Advertisement---

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత ఎవరిది..? రిబ్బన్ కటింగ్‌లా.. లేక మూడేళ్ల భూసేకరణ, పరిహారం, అనుమతుల పోరాటమా?

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత ఎవరిది? భోగాపురం విమానాశ్రయ నిర్మాణంపై చంద్రబాబు, వైఎస్ జగన్ మరియు ఎయిర్‌పోర్ట్ దృశ్యం

Summarize with AI

---Advertisement---

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram International Airport) ఇప్పుడు రాజకీయ ఘనతల పోటీకి కేంద్రబిందువుగా మారింది. విమానాశ్రయం వద్దకు వెళ్లి రిబ్బన్లు కత్తిరించడం, సెల్ఫీలు తీసుకోవడం, ఫొటోలు దిగడం సులభమే. కానీ వేలాది ఎకరాల భూసేకరణ చేయడం, రైతుల నిరసనలు ఎదుర్కోవడం, కోర్టు కేసులను అధిగమించడం, నిర్వాసితులకు పరిహారం చెల్లించడం, పునరావాస కాలనీలు నిర్మించడం, పర్యావరణ అనుమతులు సాధించడం అంత సులభమైన ప్రక్రియ కాదు.

అసలు భోగాపురం ఎయిర్‌పోర్ట్ నేడు నిర్మాణ దశకు చేరడానికి ఎవరు కృషి చేశారు? ఏ ప్రభుత్వం ఏం చేసింది? రాజకీయ ఆరోపణలు పక్కన పెడితే… వాస్తవాలు ఏమి చెబుతున్నాయి?

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత ఎవరిది


భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ ఎలా మొదలైంది?

భోగాపురం ఎయిర్‌పోర్ట్ కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం 2015 ఆగస్టు 31న ఏకంగా 15 వేల ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది.

దీనిపై స్థానిక రైతులు, ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు, వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపట్టారు. పెద్ద ఎత్తున ఉద్యమాలు, నిరసనలు, ధర్నాలు జరిగాయి.

దీంతో ప్రభుత్వం మొదట భూసేకరణను 5 వేల ఎకరాలకు, అనంతరం 2,700 ఎకరాలకు కుదించింది.

అయితే, ప్రపంచంలో ఎక్కడైనా కేవలం 5 వేల ఎకరాల్లోనే అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నారా అంటూ మరోసారి ఉద్యమాలు చెలరేగాయి. ఈ నిరసనల నేపథ్యంలో రైతులు, వైఎస్సార్సీపీ నేతలు, కమ్యూనిస్టు నాయకులు కలిపి 156 మందిపై కేసులు నమోదయ్యాయి.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత ఎవరిది


రైతుల ఉద్యమం… ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ జోక్యం

వైఎస్సార్సీపీ వాదన ప్రకారం, అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్వయంగా భోగాపురం ప్రాంతానికి వచ్చి రైతుల సమస్యలు తెలుసుకుని వారి తరఫున పోరాటం చేశారు.

చివరికి చంద్రబాబు ప్రభుత్వం భూసేకరణను 2,700 ఎకరాలకు పరిమితం చేసింది.

అయితే, ఆ 2,700 ఎకరాల ఎంపికలో కూడా వివాదాలు చెలరేగాయి. వైఎస్సార్సీపీ ఆరోపణల ప్రకారం, అప్పటి భూసేకరణలో ఎక్కువగా వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, నాయకులకు చెందిన భూములనే చేర్చగా, స్థానిక టీడీపీ నేతలు, అప్పటి అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, ప్రస్తుత జనసేన ఎమ్మెల్యేకు చెందిన మిరాకిల్ సంస్థ భూములు బయట ఉండేలా వ్యవహరించారని ఆరోపిస్తోంది.

అంతేకాదు, 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు అధిక పరిహారం చెల్లించాల్సి వస్తుందనే ఉద్దేశంతో హడావిడిగా నోటిఫికేషన్లు జారీ చేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత ఎవరిది


ఎన్నికలకు ముందు శంకుస్థాపన… కానీ పనులు ఎక్కడ?

2019 ఫిబ్రవరి 14న, ఎన్నికలకు కొన్ని నెలల ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేశారు.

అయితే అప్పటికి…

  • పూర్తి స్థాయి భూసేకరణ జరగలేదు;
  • రైతులకు పరిహారం పూర్తికాలేదు;
  • నిర్వాసితుల పునరావాసం ప్రారంభం కాలేదు;
  • పర్యావరణ అనుమతులు పూర్తికాలేదు;
  • ప్రాజెక్టుకు అవసరమైన అనేక అనుమతులు పెండింగ్‌లోనే ఉన్నాయి.

ఈ పరిస్థితుల్లో జరిగిన శంకుస్థాపన కేవలం రాజకీయ కార్యక్రమమేనని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత ఎవరిది


వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన కీలక పనులు

2019లో ప్రభుత్వం మారిన తర్వాత, 2020 జూన్ 12న వైఎస్ జగన్ ప్రభుత్వం జీఎంఆర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

అనంతరం దాదాపు మూడు సంవత్సరాల పాటు ప్రాజెక్టు అమలుకు అవసరమైన కీలక ప్రక్రియలను వేగవంతం చేసింది.

చేపట్టిన ప్రధాన పనులు

  • 2,700 ఎకరాల భూసేకరణ పూర్తి
  • 404 నిర్వాసిత కుటుంబాల పునరావాసం
  • పునరావాసం కోసం 50 ఎకరాల భూమి సేకరణ
  • రూ.77 కోట్లతో నిర్వాసితుల కాలనీ నిర్మాణం
  • సుమారు 5 గ్రామాల ప్రజలకు పరిహారం, ఇళ్లు, మౌలిక సదుపాయాల కల్పన
  • తాగునీరు, విద్యుత్, సబ్‌స్టేషన్, రహదారుల ఏర్పాటు
  • నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) సహా కీలక అనుమతుల సాధన
  • మొత్తం ప్రక్రియ కోసం సుమారు రూ.900 కోట్ల వ్యయం

ఈ ప్రక్రియలన్నీ పూర్తవడానికి దాదాపు మూడేళ్ల సమయం పట్టింది.
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత ఎవరిది


వైఎస్సార్సీపీ వాదన ప్రకారం… ఏ ప్రభుత్వం ఏం చేసింది?

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత ఎవరిది

అంశంటీడీపీ హయాంలోవైఎస్సార్సీపీ హయాంలో
భూసేకరణ నోటిఫికేషన్31-08-2015న 15 వేల ఎకరాలకు నోటిఫికేషన్2,700 ఎకరాల భూసేకరణ పూర్తి
రైతుల వ్యతిరేకతభారీ నిరసనలు, ఉద్యమాలురైతులతో చర్చలు, సమస్యల పరిష్కారం
రైతులపై కేసులు156 మంది రైతులు, నేతలపై కేసులునిర్వాసిత సమస్యల పరిష్కారంపై దృష్టి
జీఎంఆర్ ఒప్పందంలేదు12-06-2020న జీఎంఆర్‌తో ఒప్పందం
పునరావాసంపూర్తి కాలేదు404 కుటుంబాలకు పునరావాసం
పునరావాస భూమిలేదు50 ఎకరాల సేకరణ
నిర్వాసితుల కాలనీలేదురూ.77 కోట్లతో కాలనీ నిర్మాణం
మౌలిక సదుపాయాలుపూర్తి కాలేదుతాగునీరు, విద్యుత్, సబ్‌స్టేషన్, రహదారులు
పర్యావరణ, ఇతర అనుమతులుపూర్తికాలేదుఎన్‌జీటీ సహా కీలక అనుమతుల సాధన
మొత్తం వ్యయంవివరాలు స్పష్టంగా లేవుసుమారు రూ.900 కోట్ల వ్యయం
నిర్మాణ పనులకు శ్రీకారం14-02-2019న శంకుస్థాపన03-05-2023న నిర్మాణ పనుల ప్రారంభం
పూర్తి లక్ష్యంస్పష్టత లేదు2026 జూలై నాటికి పూర్తి లక్ష్యం

ఇప్పుడు లేవనెత్తుతున్న ప్రశ్నలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్‌పోర్ట్ పురోగతిని తమ విజయంగా ప్రచారం చేస్తోంది.

అయితే వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోంది…

  • కొత్తగా ఎన్ని ఎకరాలు సేకరించారు?
  • కొత్తగా ఎంత పరిహారం చెల్లించారు?
  • ఎన్ని కుటుంబాలకు పునరావాసం కల్పించారు?
  • కొత్తగా ఏ అనుమతులు తీసుకొచ్చారు?
  • కొత్తగా ఏ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు?
  • ప్రాజెక్టుకు సంబంధించి కొత్తగా తీసుకొచ్చిన నిర్ణయాలు ఏమిటి?

ఇవన్నీ జరిగి ఉంటే వాటికి సంబంధించిన ఆధారాలను ప్రజల ముందుంచాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత ఎవరిది


భోగాపురం ఎయిర్‌పోర్ట్… ఘనత ఎవరిది? ఫొటోలు దిగిన వారిదా.. పునాది వేసిన వారిదా..?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కరోజులో నిర్మాణ దశకు చేరలేదు. 15 వేల ఎకరాల భూసేకరణ ప్రతిపాదన నుంచి 2,700 ఎకరాలకు తగ్గింపు వరకు, రైతుల ఉద్యమాల నుంచి కోర్టు కేసుల వరకు, భూసేకరణ నుంచి పరిహారం వరకు, నిర్వాసితుల పునరావాసం నుంచి పర్యావరణ అనుమతుల వరకు దాదాపు మూడేళ్ల పాటు సాగిన పరిపాలనా ప్రక్రియ దీనికి పునాది.

అందుకే ఇప్పుడు రాజకీయ వేదికపై వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే…

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత ఫొటోలు దిగి రిబ్బన్లు కత్తిరించిన వారిదా…? లేక భూములు సేకరించి, రైతుల సమస్యలు పరిష్కరించి, పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించి, అనుమతులు సాధించి, నిర్మాణానికి పునాది వేసిన వారిదా…? ప్రజలే నిర్ణయించాలి.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత ఎవరిది

Join WhatsApp

Join Now
---Advertisement---

Latest Stories

Leave a Comment