ఆంధ్రప్రదేశ్లో కుటుంబ నియంత్రణ కూడా ఇప్పుడు ప్రభుత్వ అనుమతితోనే జరగాలా..? ఇద్దరు పిల్లలు చాలనుకునే పేద కుటుంబాన్ని బలవంతంగా మూడో బిడ్డ కోసం ఒత్తిడి చేయడం ఏ రకం పాలన..? పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లిలో వెలుగుచూసిన ఈ ఘటన ఇప్పుడు వైద్యశాఖ పనితీరుపై తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.
“మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.. ఇక కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలి” అంటూ నెలలుగా వేడుకుంటున్న ఓ పేద కుటుంబానికి… “మూడో బిడ్డ తర్వాతే ఆపరేషన్” అంటూ వైద్య సిబ్బంది షాక్ ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
“మూడో బిడ్డ తర్వాతే ఆపరేషన్” అనే షరతుపై మన్యం జిల్లాలో తీవ్ర వివాదం చెలరేగింది.
కుటుంబ నియంత్రణ వివాదం
పేదల జీవితాలతో ప్రయోగాలా..?
ఇప్పటికే ఇద్దరు పిల్లలను పోషించడమే భారంగా మారిందని ఆ కుటుంబం చెబుతోంది. రోజువారీ కూలి పనులతో బతుకుతున్న తమకు ఇంకో బిడ్డ అంటే మరింత ఆర్థిక భారం అవుతుందని వేడుకుంటున్నా… వైద్య సిబ్బంది మాత్రం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు… “ఇద్దరు వద్దు.. ముగ్గురు ముద్దు అని సీఎం చెబుతున్నారు” అంటూ మూడో కాన్పు కోసం ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు మరింత వివాదానికి దారితీశాయి.
ప్రజల ఆరోగ్యం కోసం పనిచేయాల్సిన వ్యవస్థ… ఇప్పుడు రాజకీయ వ్యాఖ్యలను ఆయుధంగా మార్చుకుని పేదల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకుంటోందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
కుటుంబ నియంత్రణ వివాదం

కుటుంబ నియంత్రణపై ప్రభుత్వానిదే డబుల్ గేమ్..?
ఒకవైపు దేశంలో నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు, విద్యా ఖర్చులు, వైద్య భారం గురించి ప్రభుత్వాలే మాట్లాడుతున్నాయి. మరోవైపు పేద కుటుంబాలపై ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ పరోక్ష ఒత్తిడి రావడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
ఇప్పటికే ఉన్న జనాభాకే సరైన విద్య, ఆసుపత్రులు, ఉద్యోగాలు, మౌలిక వసతులు అందించలేకపోతున్న పరిస్థితుల్లో… “మరింత జనాభా పెంచండి” అనే సంకేతాలు ఇవ్వడం బాధ్యతారాహిత్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పేదలకేనా ఈ రూల్స్..?
రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, వైద్యశాఖ పెద్దలు అందరూ తామే ముగ్గురు, నలుగురు పిల్లలను కనుతున్నారా..? లేక ఈ సలహాలు కేవలం పేదలకేనా..? అంటూ ప్రజలు మండిపడుతున్నారు.
కుటుంబ నియంత్రణ అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. ఎవరి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో… ఎంతమంది పిల్లలను పెంచగలరో… నిర్ణయించుకునే హక్కు ఆ కుటుంబానిదే. అలాంటి విషయంలో అధికారుల జోక్యం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.
ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహం
గరుగుబిల్లిలో జరిగిన ఈ ఘటనపై స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పథకాలు, వైద్య సేవలు ప్రజలకు మేలు చేయాల్సింది పోయి… ఇప్పుడు వారి వ్యక్తిగత నిర్ణయాలపై ఒత్తిడి తీసుకురావడం దారుణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సోషల్ మీడియాలో కూడా ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. “పిల్లలను కనాలా వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయమా..? కుటుంబ నిర్ణయమా..?” అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
కుటుంబ నియంత్రణ వివాదం
ప్రజల జీవితాలపై ప్రయోగాలు ఆపాల్సిన సమయం వచ్చింది..!
కుటుంబ నియంత్రణ వంటి అత్యంత వ్యక్తిగత అంశాల్లో ప్రభుత్వ యంత్రాంగం జోక్యం చేసుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. ప్రజల పరిస్థితులు అర్థం చేసుకోకుండా… రాజకీయ వ్యాఖ్యలను చూపిస్తూ పేదలపై ఒత్తిడి తేవడం మరింత ప్రమాదకర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని సామాజిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
కుటుంబ నియంత్రణ వివాదం


FAQ
కుటుంబ నియంత్రణ ఆపరేషన్పై ఏమి వివాదం?
మన్యం జిల్లాలో ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబానికి మూడో బిడ్డ తర్వాతే ఆపరేషన్ చేస్తామని చెప్పారన్న ఆరోపణలు వచ్చాయి.
ఈ ఘటన ఎక్కడ జరిగింది?
పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లిలో జరిగినట్లు సమాచారం.
ప్రజలు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు?
పేద కుటుంబాల వ్యక్తిగత నిర్ణయాల్లో అధికారుల జోక్యం పెరుగుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు.





