ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా మీద కేసుల వ్యవహారం ఇప్పుడు బహిరంగంగా డబుల్ గేమ్లా కనిపిస్తోంది. ఒకవైపు వైసీపీ అనుకూలులు ఏ చిన్న పోస్టు పెట్టినా కేసులు, అరెస్టులు… మరోవైపు టీడీపీ అధికారిక అకౌంట్ల నుంచే రెచ్చగొట్టే పోస్టులు వచ్చినా చర్యలు లేవు. ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.
🟡 🔹 టీడీపీ సోషల్ మీడియాలో హద్దులు దాటిన పోస్టులు
- అసభ్యకరంగా, వ్యక్తిగతంగా దూషించే పోస్టులు
- ప్రత్యర్థి నేతలపై అవమానకర, కించపరిచే కంటెంట్
- ప్రజలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు
- ఇవన్నీ టీడీపీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల నుంచే వెలువడటం
👉 ఇవన్నీ ఓపెన్గా జరుగుతున్నా… చట్టం మాత్రం మౌనం

🔹 ఒకే పని… కానీ రెండు విధానాలు?
- చంద్రబాబు యానిమేషన్ బొమ్మ చేతిలో కత్తి పెట్టారని వైయస్సార్సీపీ మీడియా ఇన్చార్జిని అరెస్ట్ చేశారు
- కానీ జగన్ బొమ్మ చేతుల్లో గొడ్డలి పెట్టిన వందల పోస్టులు
👉 టీడీపీ, ITDP ఆఫీషల్ పేజీల్లోనే పోస్టులు
👉 ఆఖరుకు ఈనాడు పత్రికలో కూడా ప్రచురణ
👉 ఇన్ని ఉన్నా… ఎక్కడా అరెస్టులు కనిపించడం లేదు




🔹 వైసీపీకి మాత్రం “ఆ ఊ అన్నా కేసు”
- వైసీపీ వాళ్లు చిన్న కామెంట్ చేసినా కేసులు నమోదు
- వెంటనే అరెస్టులు, విచారణలు
- సోషల్ మీడియాలో selective targeting జరుగుతోందన్న ఆరోపణలు మరింత బలపడుతున్నాయి
🔹 అధికారిక గణాంకాలు – డీజీపీ హరీష్కుమార్ గుప్తా (ఈనాడు – ఏప్రిల్ 15, 2026)
- సామాజిక మాధ్యమాల్లో అసభ్య, విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులపై
- 1,549 కేసులు నమోదు
- 1,344 అరెస్టులు
- 4,529 కంటెంట్ తొలగింపు
👉 అయితే ఈ చర్యలు ఎవరిపై ఎక్కువగా?
👉 టీడీపీ పోస్టులపై ఎందుకు కనిపించడం లేదు?
🔹 అసలు ప్రశ్న ఇదే
- ఫిర్యాదులు చేసినా ఎందుకు చర్యలు లేవు?
- టీడీపీ అధికారిక అకౌంట్లు చట్టానికి అతీతమా?
- ఒకే తప్పు చేసినా… ఒకరికి కేసు, ఇంకొకరికి క్షమా?
- చట్టం అందరికీ సమానమా… లేక అధికారానికి అనుగుణంగా మారుతుందా?




