హెరిటేజ్ పెరుగు నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నివేదిక ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. నాణ్యత లోపాలపై ఫైన్ విధించగా, దానిని హెరిటేజ్ చెల్లించిన విషయమే సంస్థ సెబికి తెలిపింది. అయితే ఈ విషయం ప్రజల్లోకి వచ్చిన తర్వాత, నమూనాల సేకరణ సరిగా జరగలేదంటూ సంస్థ వాదనలు ప్రారంభించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
❌ Fake (అబద్ధం)
- పరీక్షల కోసం నమూనాలు సరిగ్గా సేకరించలేదని హెరిటేజ్ వాదన.
- నమూనాల సేకరణలో లోపాల వల్లే ఫలితాల్లో తేడా వచ్చిందన్న ప్రచారం.
- తమ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని సంస్థ వాదన.

✅ Fact (నిజం)
- ఫుడ్ సేఫ్టీ అధికారులు హెరిటేజ్ పెరుగులో నాణ్యత లోపాలు ఉన్నట్లు అధికారికంగా నివేదిక ఇచ్చారు.
- ఆ నివేదిక ఆధారంగా హెరిటేజ్పై జరిమానా విధించబడింది.
- విధించిన ఫైన్ను హెరిటేజ్ చెల్లించిన విషయం సెబికి పంపిన లేఖలో స్పష్టంగా ఉంది.
- విషయం బహిర్గతం అయిన తర్వాతే “నమూనాలు సరిగ్గా తీసుకోలేదు” అంటూ వితండవాదం మొదలైంది.

ఫుడ్ సేఫ్టీ నివేదిక ఆధారంగా ఫైన్ విధించబడి, దాన్ని హెరిటేజ్ చెల్లించిన విషయం స్పష్టంగా ఉన్నప్పుడు, నమూనాల సేకరణపై తర్వాత వచ్చిన వాదనలు వాస్తవాలను మార్చలేవు.





