అయోధ్య రామాలయానికి పంపిన లడ్డూలపై కల్తీ నెయ్యి వాడారంటూ పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలకు వాస్తవ ఆధారాలు లేవు.
❌ FAKE
- అయోధ్య రామాలయానికి పంపిన లక్షల లడ్డూలు కల్తీ నెయ్యితో తయారయ్యాయని పవన్ కల్యాణ్ ఆరోపించారు.
✅ FACT
- 2024లో టీటీడీ నుంచి అయోధ్యకు లక్షల లడ్డూలు పంపడం జరిగింది.
- ఆ లడ్డూల తయారీకి టీటీడీ సేకరించిన నెయ్యి వినియోగించలేదు.
- అప్పటి టీటీడీ బోర్డు సభ్యుడు సౌరభ్ బోరా, మాజీ బోర్డు సభ్యుడు జూపల్లి రామేశ్వరరావు చెరో 2 వేల కిలోల దేశీ ఆవునెయ్యిని అందించారు.
- అదే నెయ్యితో లడ్డూలు తయారు చేసి అయోధ్యకు పంపారు.
ప్రస్తుత అంశానికి సంబంధం లేని విషయాన్ని తెరపైకి తెచ్చి జాతీయ స్థాయిలో రాజకీయంగా మలచే ప్రయత్నమే ఈ ఆరోపణల్లో కనిపిస్తోంది. అయోధ్యకు పంపిన లడ్డూలపై కల్తీ నెయ్యి ఆరోపణలు పూర్తిగా అబద్ధం..
https://news.tirumala.org/ttd-dispatches-srivari-laddu-prasadams-to-ayodhya






